రెండో విడత అక్రిడేషన్ కమిటీ సమావేశం వెంటనే నిర్వహించాలి.

TUWJ-IJU వికారాబాద్ జిల్లా  ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్
 వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి డిసెంబర్ 2
          వికారాబాద్ జిల్లాలో రెండో విడత అక్రిడేషన్ కమిటీ సమావేశం వెంటనే నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్ కు అందజేసిన వినతి పత్రంలో కోరారు. శుక్రవారం డిఆర్ఓ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరమణ జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు  ఆనంద్, సుక్కయ్యలతో కలిసి వినతి అందజేశారు. జిల్లాలో ఇంకా 100కు పైగా అక్రిడేషన్ కార్డులు రాక జర్నలిస్టులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని  పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో రెండో విడతకు సంబంధించి అక్రిడేషన్  కార్డులను అందించారని తెలిపారు. ఒక్క వికారాబాద్ జిల్లాలోనే రెండో విడత అక్రిడేషన్ కార్డులను అందజేయక జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జర్నలిస్టుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వీలైనంత తొందరగా రెండవ విడత అక్రిడేషన్ సమావేశం నిర్వహించాలని  డిఆర్ఓను కోరారు. దీనిని గాను డిఆర్ఓ అశోక్ కుమార్ స్పందిస్తూ వచ్చే శుక్రవారం లోపు అక్రిడేషన్ సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.