రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శించిన సునీల్ రెడ్డి

 

 

 

 

 

 

జనం సాక్షి, కమాన్ పూర్ : పెద్దపెల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామం లో త్వరలో గౌడ సంఘము ఆధ్వర్యంలో ప్రతిష్టాపన జరగనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లీ దేవాలయంను బుధవారం బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునిల్ రెడ్డి సందర్శించారు. సందర్భంగా రేణుక ఎల్లమ్మ గుడి కమిటీ పాలకవర్గం, గౌడ కులస్తులు సునీల్ రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు జంగపల్లి అజయ్, సీనియర్ నాయకులు, మచ్చ గిరి రాము,మట్ట శంకర్ మండల ప్రధాన కార్యదర్శులు మల్లారపు అరుణ్ కుమార్,బర్ల సదానందం, పాలకుర్తి మండల సహ ఇంచార్జ్ కొయ్యడ సతీష్, తదితరులు పాల్గొన్నారు.