రేపు రాయికోడ్ కు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ రాక

 

 

 

 

 

 

 

 

 

రాయికోడ్ జనం సాక్షి జనవరి 31 రాయికోడ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు లో నిర్వహించే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడానికి నేడు బుధవారం ఉదయం 11 గంటలకు ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ రానున్నట్లు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బస్వరాజ్ పాటిల్, ప్రధాన కార్యదర్శి కొల్లూర్ శంకర్ లు మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ 1కోటి 4లక్షల నిధులతో రాయికోడ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి , రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమానికి హాజరవుతారన్నారు. అనంతరంధర్మాపూర్ గ్రామంలో గృహప్రవేశ వేడుకలో పాల్గొంటారని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన లకు మండలంలోని ప్రజాప్రతినిధులు, జడ్పిటిసి మల్లికార్జున్ పటేల్ ఎంపీపీ మమతా అశోక్. ఆత్మ కమిటీ చైర్మన్ విఠల్. రాయికొడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ నవిత వైస్ చైర్మన్ మారుతీ. ఎంపిటిసిలు సర్పంచులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, శ్రేణులు పార్టీ కార్యకర్తలు, అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.