రేవంత్‌ వెంటే శశికళా

సంగారెడ్డి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెండ్‌ రేవంత్‌రెడ్డి రాజీనామాతో టీడీపీలో కలవరం మొదలైంది. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుండటంతో ఆయన బాటలో నడించేందుకు చాలా మంది టీడీపీ సీనియర్లు సిద్ధమయ్యారు. సోమవారం ఉదయం తన అనుచరులు, పార్టీ కార్యకర్తలు, ముఖ్యనేతలతో రేవంత్‌ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. రేవంత్‌ రాజీనామా అనంతరం మిగతా నేతలంతా టీడీపీకి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శశికళ యాదవరెడ్డి తన రాజీనామాను టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. అయితే శశికళ.. రేవంత్‌ బాటలోనే నడిచి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటానని లేఖలో స్పష్టం చేశారు. ఇకపోతే జిల్లాలో ముఖ్య నేతగా ఉన్న వంటేరు ప్రతాపరెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం సాగుతోంది.