రైతుల కోసమే పని చేస్తాం – రాహుల్..

ఆదిలాబాద్ : కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతుల కోసమే పనిచేస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వడ్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతులకు సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, రైతులు, కూలీలు జీవితాంతం ఎండలో పనిచేస్తుంటారని వారిని ప్రభుత్వాలు ఆదుకోవాలని రాహుల్ తెలిపారు.