రైతుల పరిస్థితి దయనీయం: బొత్స

అమరావతి: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీమంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఓపక్క కరువు, మరోపక్క పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. గుంటూరు మిర్చి రైతులకు గిట్టుబాటు ధర హామీ అమలు చేయాలని, ఎన్డీయేతో రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతగా ఉండి ఏం చేసిందో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. అలాగే ప్రత్యేక హోదాపై చర్చలో ఎంపీలు నోరు మెదపలేదని ఆయన పేర్కొన్నారు.