రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే రైతు సంక్షేమం కోసం 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన.. మొయినాబాద్‌లో రూ.3 కోట్లతో నిర్మించిన వ్యవసాయమార్కెట్ గోదాంను ప్రారంభించారు. సీఎం చొరవతో జిల్లా వ్యాప్తంగా 74 కోట్లతో 49 గోదాములు నిర్మించినట్లు మంత్రి తెలిపారు.