రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో

ఖమ్మం, మే 12: ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు జిల్లాలోని కల్లూరు మండలం ముచ్చవరం వీఆర్వో. ఓ రైతుకు చెందిన పాస్‌బుక్‌ ఇచ్చేందుకు వీఆర్వో వసంతబాయి ఐదువేల రూపాయలు డిమాండ్‌ చేశారు. దీంతో ఆయన ఏసీబీ అధికారులకు మొరపెట్టుకున్నాడు. వారు కాపుకాసి రైతు లంచం ఇస్తుండగా వీఆర్వోను పట్టుకున్నారు. ఆమెతోపాటు ఓ ప్రైవేటు గుమస్తాను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.