రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య

మెదక్, మే 12: జిల్లాలోని జహీరాబాద్ శివారులోని బీదర్‌రోడ్డులో ఘోరం జరిగింది. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనపరుచుకున్నారు. మృతులకు సంబంధించిన విషయాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు.