రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య
 మెదక్ : పెద్దలు తమ పెళ్లికి అంగీకరించటం లేదని మనస్థాపానికి గురైన ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా తుప్రాన్ లో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు…తుప్రాన్ మండలం, పడాల్‌పల్లి గ్రామానికి చెందిన మౌనిక(20) స్థానిక ప్రైవేటు డిగ్రి కళాశాలలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతుంది. మేడ్చల్ కు చెందిన నగేష్(24) స్తానికంగా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కలిసి బతకాలని నిర్ణయించుకున్న వీరిద్దరి ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు.

ఈ క్రమంలో మౌనికకు ఇటీవల వేరే వ్యక్తితో వివాహం చేయడానికి నిర్ణయించారు. దీంతో మనస్థాపానికి గురైన ప్రేమికులు బుధవారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి బలవన్మారణానికి పాల్పడ్డారు. ఈ ఘటనను స్తానికలు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇరువురి కుటంబ సభ్యులకు సమాచారం అందించి విచారిస్తున్నారు.