రోడ్డుదాటుతున్న బాలుడిని ఢీకొన్న కారు

అక్కడిక్కడే మృతి చెందిన బాలుడు
అనంతపురం,ఫిబ్రవరి12 జ‌నంసాక్షి): ఉరవకొండ మండల కేంద్రంలోని బళ్లారి బైపాస్‌ రోడ్డులో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కార్తిక్‌ అనే బాలుడు రోడ్డు దాటుతుండగా బళ్లారి నుంచి అనంతపురానికి వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కార్తిక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. శవ పరీక్ష కోసం కార్తిక్‌ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.