రోడ్డుపక్కన ఉన్నవారిపై దూసుకెళ్లిన కారు

తీవ్రగాయాలతో నలుగురికి ఆస్పత్రిలో చికిత్స
గ్వాలియర్‌,జూన్‌1(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఒకపక్కన ద్విచక్రవాహనాలను ఆపి మాట్లాడుకుంటున్న వారిపైకి వేగంగా వచ్చి ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. మధ్యప్రదేశ్‌ ఇంధనశాఖ మంత్రి ప్రద్యుమన్‌ తోమర్‌ ఇంటి సవిూపంలోలోనే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.