రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్‌,మార్చి02(జ‌నంసాక్షి: ఇటిక్యాల మండల పరిధిలోని ఎర్రావల్లి చౌరస్తా సవిూపంలో జాతీయరహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొన్న సంఘటనలో వ్యక్తి మృతి చెందాడు. వడ్డేపల్లి మండలం కోవెలదిన్నె గ్రామానికి చెందిన సీతన్న(45)ను సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలపాలై పడి ఉన్న అతనిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమందించారు.పోలీసులు సంఘటనస్థలానికి చేరుకుని కొన వూపిరితో ఉన్న సీతన్నను హైవే అంబులెన్స్‌లో గద్వాల ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.