రోడ్డు ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి

ఉత్తరప్రదేశ్ జ‌నంసాక్షి

ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. మధురలో ట్రాక్టర్ ను వ్యాన్ ఢీకొట్టడంతో ఆరుగురు కూలీలు మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని మధురలోని ఆస్పత్రిలో చేర్పించారు. అతి వేగంతో పాటూ పొగ మంచు ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కూలీ పనుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగినప్పుడు ట్రాక్టర్ లో 30 మంది వరకు ఉన్నారు. అయితే ఎదురుగా వస్తున్న వ్యాన్ .. వేగంగా వచ్చి ఢీకొట్టిందని, 30 మీటర్ల లోపు వాహానాలు కనిపించకపోవడంతో.. ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.