రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

నల్గొండ: నల్గొండ జిల్లా ఆలేరు శివారులో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. హైదరాబాద్ నుంచి వరంగల్కు కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యానును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. డీసీఎంలో ప్రయాణిస్తున్న వంశీరెడ్డి (28), పరమేశ్వర్ (32) అక్కడికక్కడే మరణించారు. మృతులు మహబూబ్నగర్ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఆలేరు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.