రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి

మహబూబ్‌నగర్ : వంగూర్ మండలం కోనేటిపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. టిప్పర్ లారీ – ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.