రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

భువనగిరి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని హనుమాపురం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన జిన్న మురళీ (17) ఆదివారం గ్రామంలో జరిగిన దుర్గమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నాడు. పండుగకు ఏర్పాటు చేసిన డీజే మైక్‌ సెట్‌ ఆపరేటర్‌ భువనగిరికి చెందిన మాటూరి శశికాంత్‌ను(19)ను దింపేందుకు భువనగిరికి ద్విచక్రవాహనంపై బయల్దేరారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో వీరిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి గ్రావిూణ ఎస్సై రాఘవేంద్ర పేర్కొన్నారు.