రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

నిజామాబాద్‌,మే12(జ‌నం సాక్షి ): ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్‌పల్లి అటవీ ప్రాంతంలో 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై రాజశేఖర్‌ తెలిపిన వివరాల మేరకు రాజస్థాన్‌కు చెందిన గవుర్‌ రామ్‌ కుటుంబ సభ్యులతో కలిసి కారులో హైదరాబాద్‌ వైపుకు వెళుతున్నారు. చంద్రాయన్‌పల్లి అటవీ ప్రాంతం వద్దకు చేరేసరికి ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టడంతో గవుర్‌రామ్‌(60) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ కుటుంబ సభ్యులను నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు.