రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ఖమ్మం: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. కంకర లోడుతో వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ వెంపటి శ్రీనివాస్ చంద్రశేఖర్(35) అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.