రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి…

accident 4రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కడప నుండి వస్తున్న లారీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో భారత్ గార్డెన్ వద్ద ఆగివున్న మరో లారీని ఢీకొంది. అనంతరం ఈ రెండు లారీలు రోడ్డు పక్కన ఆగివున్న బైక్ బైక్ ఢీకొన్నాయి. దీంతో లారీలోని ముగ్గురు వ్యక్తులు, బైక్ పై ఉన్న వ్యక్తి మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతుల్లో కొందరు అనంతపురం జిల్లా వాసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.