రోడ్డు ప్రమాదంలో మాజీ డీజీపీ మనవడి మృతి..

హైదరాబాద్ : కోకాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ డీజీ పేర్వారం రాములు మనువడు దుర్మరణం చెందాడు. ఇతనితో పాటు మరో ఇద్దరు కూడా మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కోకాపేట వద్ద పాల వ్యాన్ ను స్కోడా కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. జ్ఞాన్ దేవ్, అరుణ్, రాహుల్ లతో పేర్వారాం రాములు మనువడు వరుణ్ పవార్ స్కోడా కారులో గచ్చిబౌలి నుండి ఎయిర్ పోర్టుకు వెళుతున్నారు. మిల్క్ వ్యాన్ ను వెనుకనుండి స్కోడా కారు అతివేగంగా ఢీకొంది. దీనితో ముగ్గురు అక్కడికక్కడనే మృతి చెందగా రాహుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి గురైన కారు పేర్వారం ఇందిర పేరిట ఉందని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పేర్వారం కుటుంబసభ్యులు ప్రమాదస్థలికి బయలుదేరారు.