రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

మంచిర్యాల,జనవరి30(జ‌నంసాక్షి): ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గిరిని బలితీసుకుంది. జిల్లాలోని చెన్నూర్‌ మండలం కిష్టంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, టాటా ఏస్‌ వాహనం ఒకదానికినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రాంతం హృదయవిదారకంగా మారింది. రోదనలు మిన్నంటాయి. క్షతగాత్రులు బాధతో ఆస్పత్రి వద్ద విలపించారు. పోలీసులు సకాలంలో అక్కడికి చేరుకుని సహాయం అందించారు.