లక్ష్యం మేరకు మిషన్‌ భగీరథ పనులు :ఎమ్మెల్యే జలగం

కొత్తగూడెం,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): మిషన్‌ భగీరథ పనులను నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తి చేసి ఇంటింటింకీ మంచినీరు అందిస్తామని కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు అన్నారు. సిఎం కెసిఆర్‌ ఆదేశాల మేరకు పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. ఇంటింటికి తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. జిల్లాలో మిషన్‌ బగీరధ పనులను వేగవంతం చేసి గడువులోపూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పలుచోట్ల మిషన్‌ భగీరథ పనులను ఆయన నీటిపారుదలశాఖ, విద్యుత్‌శాఖ అధికారులతో కలిసి పరిశీలించాక పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్‌ భగీరథ పనులు చురుకుగా జరుగుతున్నాయని గడువులోపు పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు.