లక్ష్యం మేరకు సభ్యత్వం నమోదు: ఎమ్మెల్యే పువ్వాడ

ఖమ్మం,జూలై22(జ‌నంసాక్షి): ఎన్నికల వరకే రాజకీయాలని తర్వాత అభివృద్ధి విషయంలో అంతా ఒక్కటే అని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు పరతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గతంలో వచ్చిన ఫలితాలు పునరావృతం కావాలన్నారు.
టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా పూర్తయ్యిందని, లక్ష్యం మేరకు పూర్తి చేశామని అన్నారు. జిల్లాలోనే ఖమ్మం నియోజకవర్గంలో అత్యధికంగా పార్టీ సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే 50 వేలపైగా నమోదు కాగా అదనంగా మరో 10 వేల పుస్తకాలను తీసుకోవడం జరిగిందన్నారు. అభివృ ద్ధి, సంక్షేమం పాలనతో ప్రజల్లో మరింత నమ్మకం పెరిగిందని అందుకే సభ్యత్వాలు పెద్ద ఎత్తున చేరుతున్నారని పేర్కొన్నారు. కొత్తగా పార్టీపై నమ్మకంతో చేరుతున్న వారికి సైతం సముచిత స్థానం ఉంటుందన్నారు.  ఎన్నికల్లో ప్రజలు గెలుపు ఓటమిలు నిర్ణయిస్తారని, ప్రజా  సమస్యల పరిష్కారం కోసం పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.  అందరూ ఒకే వైపే ఉంటే అభివృద్ధి  మరింత ముందుకు తీసుకు పోయేందుకు అవకాశం ఉంటుందన్నారు. బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి, వారి సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం లేకుండా పోయిందన్నారు. దీంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడుతున్నారని  పేర్కొన్నారు.