లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు

 

రంగారెడ్డి,నవంబర్‌22(జ‌నంసాక్షి): షాద్‌నగర్‌ పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై కర్నూలు నుంచి హైదరాబాద్‌ వైపు వస్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్‌కి చెందిన బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది.

గురువారం ఉదయం చోటుచేసుకున్నఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న షాద్‌నగర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంలో గాయపడిన వారిని షాద్‌నగర్‌ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు.