లారీని ఢీకొన్న తుపాన్ వాహనం
వేగంగా ఢీకొనడంతో నలుగురు మృతి
సంగారెడ్డి,ఆగస్ట్31(జనం సాక్షి): సదాశివపేట మండలం మద్దికుంట వద్ద అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంఓల కనీసం నలుగురు దుర్మరణం చెందారు. ఆగివున్న లారీని తుఫాన్ వాహనం ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కర్నాటక నుండి హైదరాబాద్ వస్తున్న తుఫాన్ వాహనం కర్ణాటక వెళుతున్న లారీ ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు మృతుల దేహాలు ఛిద్రమయ్యాయి. మృతులు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ కు చెందినవారిగా గుర్తించారు. కర్నాటకలో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. తూఫాన్ వాహనం వేగంగా రావడంతో లారీ కిందకు దూసుకెళ్లింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన రెండు వాహనాలూ కర్ణాటకకు చెందినవిగా పోలీసులు గుర్తించారు.