వందసీట్ల గెలుపు ఖాయం: పద్మా

మెదక్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పద్మాదేవేందర్‌ రెడ్డి సోమవారం నామినేషన్‌ దాఖలు

చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని, వంద సీట్లు గెలుచుకుంటామని, కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ చేసిన అభివృద్ది కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్నారు. ఏ పార్టీ చేయని అభివృద్ధిని నాలుగున్నరేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం చేసిందని పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు.