వరంగల్‌లో రెండు చోట్ల చైన్‌స్నాచింగ్‌లు

: వరంగల్‌ నగరంలో రెండు చోట్ల చైన్‌ స్నాచింగులు జరిగాయి. పోశమ్మ మైదానం దగ్గర ఓ మహిళ మెడలో నుంచి 5 తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని దుండుగులు అపహరించుకువెళ్లారు. కాజిపేటలోని సిద్ధార్ధనగర్‌లో మరో మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసును లాకెళ్లారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.