వాజ్‌పేయికి నివాళి అర్పించిన లెఫ్ట్‌ నేతలు

న్యూడిల్లీ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): ఓ అరుదైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి దివంగత మాజీ ప్రధాని, ‘భారత రత్న’ అటల్‌ బిహారీ వాజ్‌పేయికి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నివాళులర్పించారు. వాజ్‌పేయి గొప్పతనాన్ని వివరిస్తూ అటల్‌జీ ఎన్నడూ రాజకీయ, సైద్దాంతిక విభేదాల కారణంగా మానవత్వానికి హాని జరగనివ్వలేదన్నారు. అలాంటి సిద్దాంతం నేడు మన దేశానికి అవసరమని చెప్పారు. ఆయనతో తమకెప్పుడూ విభేదాలు లేవన్నారు. ఆయన ఓ మానవతావాది అన్నారు. అలాంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధానిగా పనిచేయడం గొప్పవిషయమన్నారు. ఏచూరీ, సిపిఐ కార్యదర్శి రాజా,నారాయణ తదితరులు నివాళి అర్పించారు.