వాజ్‌పేయి దేశానికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు

– వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : తాను నమ్మిన సిద్ధాంతాన్ని మానవతా దృక్పథంతో ప్రజల మనోభావాలకు అనుగుణంగా చివరి వరకు ఆచరించి చూపించిన గొప్ప నేత వాజ్‌పేయి అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొనియాడారు. శుక్రవారం విజయసాయి వాజ్‌పేయి భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ దేశానికి దిశా నిర్దేశం చేసినటువంటి నేత మరణం తీరనిలోటని అన్నారు. మితవాదాన్ని నమ్మి సమర్థవంతంగా.. ఒక పరిపాలనాధ్యక్షుడుగా సుపరిపాలన అందించిన వ్యక్తి అని ఆయన అన్నారు. 10సార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు పనిచేసి దేశానికి దిశా నిర్దేశం చేసిన మహానుభావుడు వాజ్‌పేయి అని, ఆయన మరణంతో దేశం ఒక మ¬న్నతమైనటువంటి నాయకుడిని కోల్పోయామని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని విజయసాయిరెడ్డి మనసారా కోరుకున్నారు.