వారసత్వ ఉద్యోగాల కోసం పోరు

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు తీసుకొస్తామని హావిూ ఇచ్చి దాన్ని సాధించకుండా తెబొగకాసం, తెరాసలు కార్మికులను మోసం చేశాయని సీఐటీయూ అనుబంధ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం నేతలు అన్నారు. సీఎం కేసీఆర్‌ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరిస్తామని సమాధానం చెప్పి సంవత్సరం దాటిపోయిందన్నారు. వారసత్వ ఉద్యోగాలే ప్రధాన అజెండాగా పేర్కొని ఎన్నికల్లో గెలుపొందిన తెబొగకాసం ఇచ్చిన హావిూని నిలబెట్టుకోలేక పోయిందన్నారు. వారసత్వ ఉద్యోగాలు ఇప్పించాలని అడిగిన కార్మికుల వారసులపై తెబొగకాసం నాయకులు దాడులకు పాల్పడటం అన్యాయమన్నారు.