వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు: జీవన్‌ రెడ్డి

జగిత్యాల,అగస్టు6( జనం సాక్షి): మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పదవికి రాజీనామా చేయడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజగోపాల్‌ రెడ్డి పార్టీని వీడడంపై పార్టీ నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌కి, వెంకట్‌ రెడ్డికి మధ్య ఏం జరుగుతుందో తెలియదు. పీసీసీ చీఫ్‌ ఒక సమన్వయ కర్త. మేమంతా సోనియా నాయకత్వంలో పని చేస్తున్నాం. అందరినీ సంతృప్తి పరచడం ఎవరి వల్లా కాదు. పీసీసీ చీఫ్‌ ఆయన పరిధి మేరకు పని చేస్తున్నారు. శ్రవణ్‌ పార్టీని వీడటం బాధాకరం. హుజురాబాద్‌, మునుగోడును రెండూ ఒకేలా చూడలేమని పేర్కొన్నారు.