విజయవంతంగా అగ్ని-5 క్షిపణి పరీక్ష
– దృవీకరించిన రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్
న్యూఢిల్లీ, జనవరి18(జనంసాక్షి) : అణు సామర్థ్యం గల ఖండాతర క్షిపణి అగ్ని-5ని భారత్ గురువారం ఉదయం ప్రయోగించింది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి క్షిపణి ప్రయోగం విజయవంతంగా నిర్వహించింది. దీనిని భూ ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారు. 5000 కిలోవిూటర్ల స్టైక్ర్ రేంజ్ గల ఈ క్షిపణి చైనాలోని ఉత్తర ప్రాంతాల వరకు చేరుకోగలదు. ప్రయోగం విజయవంతమైనట్లు రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. డీఆర్డీఓ తయారుచేసిన ఈ క్షిపణి 1.5టన్నుల అణు వార్హెడ్ను మోసుకుపోగలదు. 17.5విూటర్ల పొడవైన అగ్ని-5 సుమారు 50 టన్నుల బరువు ఉంటుంది. అగ్ని-5ని 2012 ఏప్రిల్లో, 2013 సెప్టెంబరులో, 2015జనవరిలో చివరగా 2016 డిసెంబరులో పరీక్షించారు. ఈ క్షిపణిని ప్రవేశపెట్టిన అనంతరం భారత్ ఖండాతర బాలిస్టిక్ మిస్సైల్ క్లబ్లో అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే సరసన చేరనుంది.