విజయవంతంగా సుష్మా కిడ్నీ మార్పిడి

విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఢిల్లీ ఎయిExternal Affairs Minister Sushma Swaraj shakes hands with her Sri Lankan counterpart GL Peiris during a meeting in New Delhi on July 11, 2014. (Photo: IANS)మ్స్ కార్డియో థొరాసిక్ సెంటర్‌లో సుమారు 5 గంటలపాటు చికిత్స సాగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన చికిత్స మధ్యాహ్నం రెండున్నర దాకా సాగింది. ఈ చికిత్స నిర్వహించిన డాక్టర్ల బృందంలో ఎయిమ్స్ డైరక్టర్ ఎంసీ మిశ్రా, నెఫ్రాలజిస్ట్ సందీప్ మహాజన్, సర్జన్లు వికె బన్సల్, వి.శీను ఉన్నారు. ఈ నెల 7న ఆమె ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. సుష్మాకు కిడ్నీ ఇస్తామంటూ అనేకమంది ముందుకు వచ్చారు. అయితే దాత ఎవరనేది ఇంకా తెలియరాలేదు.