విజయవాడలో మెడికో ఆత్మహత్య

విజయవాడ,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): విజయవాడ నగరంలో మెడికో ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆమె ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్తపేటలో ఎంబీబీఎస్‌ విద్యార్థిని హిమాజ ఆత్మహత్య కలకలం రేపుతోంది. పరీక్షలు సరిగా రాయలేదనే మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సిద్దార్థ మెడికల్‌ కాలేజీలో హిమజ ఎంబీబీఎస్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.