విత్తన వినాయకుల పంపిణీ

వరంగల్‌ రూరల్‌,ఆగస్ట్‌31  ( జనంసాక్షి  ) :   వినాయక చవితిని పురస్కరించుకొని గ్రామాల్లో, నర్సంపేట పట్టణంలో ఇళ్లలో ప్రతిష్ఠించే గణపతి ప్రతిమలను ప్రజలకు ఉచితంగా ఇచ్చేందుకు నర్సంపేట పట్టణానికి చెందిన గోక రామస్వామి గణనాథులను సిద్ధం చేసారు. గోక లీలావతి ట్రస్టు ఆధ్వర్యంలో రామస్వామి ఏటా 500 గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈసారి ఆయన ఇంటి ఆవరణలో నలుగురు బాలురతో కలిసి మట్టి గణపయ్యలను తయారు చేస్తున్నారు. ఈసారి మొక్కల విత్తన ప్రతిమను రూపొందిస్తున్నారు. ఒక్కో వినాయక విగ్రహంలో ఒక విత్తనాన్ని పెట్టి తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఆ ప్రతిమలను నీళ్లలో నిమజ్జనం చేయడం వల్ల మట్టి కరిగిపోయి విత్తనం మొలకెత్తుతుందని వివరించారు.