విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ వర్ధంతి

విజయనగరం,మార్చి26(జ‌నంసాక్షి): విజయనగరం అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ భవనంలో నవ యువ సమాఖ్య, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థల ఆధ్వర్యంలో భగత్‌ సింగ్‌ 88 వ వర్థంతి సభను మంగళవారం నిర్వహించారు. ఈ సభలో వక్తలు మాట్లాడుతూ.. భగత్‌సింగ్‌ ఆశయం గొప్పది అని పేర్కొన్నారు. సమ సమాజాన్ని కోరుకున్న వ్యక్తి, గొప్ప సాధకుడు భగత్‌సింగ్‌ అని కొనియాడారు. ఈ నెల 23 వ తేదీన భగత్‌ సింగ్‌, రాజగురు, సుఖ్‌దేవల 88 వ వర్థంతి సందర్భంగా వారి త్యాగ జీవితాలను ఈ రోజు స్మరించుకున్నారు.