విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

 

 

 

 

 

: మంత్రి సత్యవతివిద్యావ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సత్యవతి
ములుగు: రాష్ట్ర ప్రభుత్వం మనసుపెట్టి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నదని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మన ఊరు-మన బడి మొదటి విడుతలో ప్రతి మండలానికి నాలుగు పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా అభివృద్ధి చేశామన్నారు. రానున్న మూడేండ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు కల్పిస్తామని తెలిపారు. ములుగు జిల్లా గోవిందరావుపేటలో మన ఊరు-మన బడిలో భాగంగా అభివృద్ధిచేసిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి ప్రారంభించారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు తాగునీటి వసతితోపాటు మరుగుదొడ్లు, కిచెన్ షెడ్‌ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు.