వినాయక్ నగర్ కాలనీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి

కొండమల్లేపల్లి డిసెంబర్ 14 జనం సాక్షి న్యూస్ కొండమల్లేపల్లి పట్టణంలోని బుధవారం నాడు వినాయక్ నగర్ కాలనీలో దేవాలయంలో గత మూడు రోజులగా చేపట్టినవటువంటి శ్రీ లక్ష్మీ సరస్వతి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్థంభ, ప్రతిష్ట కార్యక్రమలలో స్థానిక ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ కొండమల్లేపల్లి పట్టణంలో గత మూడు రోజులుగా శ్రీ లక్ష్మీ సరస్వతి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో కన్నుల పండుగగా జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి పాల్గొని ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి అని ఆయన అన్నారు.చింతనతో మానసిక ప్రశాంతత అని వారు అన్నారు స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు
యువజన కాంగ్రెస్ నాయకులు మంగ్య నాయక్, సేవ నాయక్, మహేందర్, కార్తిక్, ఎన్ ఎస్ యు ఐ స్టేట్ కో-ఆర్డినెటర్ యండి.ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.