విమానగోపురానికి దానం విరాళం

యాదాద్రి భువనగిరి,డిసెంబర్‌6  (జనంసాక్షి);  యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి దాతల నుంచి భారీ స్పందన లభిస్తున్నది. భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేస్తున్నారు. సోమవారం ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కుటుంబ సమేతంగా రూ. 55 లక్షల విలువ గల చెక్కులను ఆలయ ఈవో ఎన్‌ గీతకు యాదాద్రి బాలలయంలో అందజేశారు.