విమోచన ఆందోళనలపై మౌనం సరికాదు

నిజామాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా విమోన దినోత్సవంపై ఆందోళనలు జరుగుతన్నా సిఎం కెసిఆర్‌ దీనిపై స్పందించక పోవడం రాజకీయం కాక మరోటి కాదని బిజెపి జిల్లా నాయకుడు ప్లలె గంగారెడ్డి అన్నారు. ఇదంతా ప్రజలను వంచించడం తప్ప మరోటి కాదన్నారు. కేవలం ఎంఐఎంపు సంతృప్తి పరచడానికి తెలంగాణ ప్రజలను వంచిండం తప్పమరోటి కాదన్నారు. గత రెండేల్లుగా మౌనం వహించిన ప్రజలు ఇప్పుడు నిలదీస్తున్‌ఆన సమాధానం చెప్పడం లేదన్నారు. కేసీఆర్‌ పూటకోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం చెబుతున్నది ఒకటి చేస్తున్నది మరొకటి అని పేర్కొన్నారు. అమరుల త్యాగాలను రాజకీయం చేయొద్దని కోరారు. సెప్టెబరు 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే విషయంలో ఇబ్బంది ఉంటే కనీసం కారణాలు చెప్పాలని అన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణాతో కలిపి పలు రాష్టాల్రు విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధివిధానాలను రూపొందించి ప్రజల అభీష్టాలను గౌరవించాలని కోరారు. తెలంగాణ పోరాటానికి ఘనమైన చరిత్ర ఉందని, భారత దేశంలో విలీనానికి ముందు ప్రజలు పడ్డ బాధలు, మహిళలు ఎదుర్కొన్న అవమానాలు, అమరుల త్యాగాలు ఎన్నో ఉన్నాయని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. 17ను అధికారికంగా ప్రకటిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పడం వంచించడమేనని అన్నారు. సెప్టెంబరు 17న తెలంగాణ విలీన ఉత్సవాలను తెరాస ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పల్లె కోరారు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన రోజు సెప్టెంబరు 17న తెలంగాణ విలీన ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. ఇలా చేయడం తెలంగాణ గౌరవాన్నికాపాడుకుని అమరులను స్మరించుకోవడం అవుతుందని అన్నారు.