విషజ్వరాల నివారణకు ప్రత్యేక శిబిరాలు

కరీంనగర్‌,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): మహదేవపూర్‌, కాటారం మండలాల్లో విష జ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా ఈ సీజన్‌లో జ్వరాలు ప్రబలుతున్నా అధికారులుపెద్దగా పట్టించుకోవడం లేదు. ఇటీవలి వర్షాలతో మళ్లీ అంటువ్యాధుల భయం వెన్నాడుతోంది. పారిశుద్ధ్య లోపం, తాగునీరు, దోమల సమస్యలతో విషజ్వరాలు ప్రబలాయని తెలిపారు. ప్రజలకు అవగాహనలోపంతో విషజ్వరాల తీవ్రత పెరిగిపోయినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటుచేయాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రత్యేకంగా పారిశుద్ద్యం, తాగునీటి క్లోరినేషన్‌ చర్యలు చేపట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. అవసరమైన వైద్యులను, సిబ్బందిని ఇతర ప్రాంతాల నుంచి డిప్యూటేషన్‌ వేసి ప్రత్యేక వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు.ఈ ప్రాంతంలో ప్రబలుతున్న విషజ్వరాలపై ఆందోళన చెందవద్దని, అత్యవసర చికిత్స అవసరమయితే జిల్లా కేంద్రాలకు తరలించి ప్రత్యేక్ష పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందిస్తామని జిల్లా అధికారులు హావిూనిచ్చారు. జ్వరపీడితులకు వైద్యసేవలు అందుతున్నాయని, పరిస్థితి విషమంగా ఉన్న వారిని జిల్లా ప్రధాన ఆసుప్రతి, ప్రతిమ వైద్యశాలకు తరిలించి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. వ్యక్తిగత శుభ్రతతోపాటు చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచే బాధ్యత అందరిపైన ఉందనన్నారు.