: వీఆర్ఏలకు మద్దతుగా కాంగ్రెస్

 నర్సాపూర్ ( జనం సాక్షి  ) :   నర్సాపూర్  నియోజకవర్గంలో, వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రిలే నిరాహర దీక్షకు మద్దతు తెలిపి నర్సాపూర్ లో ర్యాలీ నిర్వహించారు. టీపిసిసి అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతు ఆర్.ఏల పే స్కేల్ జి.ఓ వెంటనే విడుదల చేయాలి డిమాండ్ చేశారు..అర్హత కలిగిన వి.ఆర్.ఏ లకు పదోన్నతులు కల్పించాలన్నారు. 55 సం||లు నిండిన వి.ఆర్.ఏల స్థానంలో వారసులకు వి.ఆర్.ఏ ఉద్యోగం ఇవ్వాలి డిమాండ్ చేసారు.
వీఆర్ఏలు చేసిన సేవలు మర్చిపోయి ప్రభుత్వం ఈరోజు వీఆర్ఏలను దిక్కుతోచని స్థితిలో వదిలిపెట్టడం ఎంతవరకు సమంజసం అని వ్యాఖ్యానించారు.గత ప్రభుత్వాలు వీఆర్ఏలతో పని చేయించుకున్నాయి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కెసిఆర్ మొండివైఖరిని స్పష్టంగా కనిపించిందని అన్నారు.కావున వీఆర్ఏల న్యాయమైన కోరికలు తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో  సీనియర్ కాంగ్రేస్ నాయకులు శ్రీనివాస్ గుప్తా MPP జ్యోతి సురేష్ నాయక్ నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేష్ నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్  రామ గౌడ్ తదితరులు  పాల్గొన్నారు