వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు

24brk41aacహైదరాబాద్‌: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెల్లవారుజామున 4గంటలకు తొలి బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా వచ్చిన మంత్రి పట్టువస్త్రాలతో అమ్మవారికి బోనం సమర్పించారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రతా చర్యలతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత అత్యంత వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది మంచి వర్షాలు పాడిపంటలతో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. తెల్లవారుజామున 2గంటల నుంచే బోనాలు సమర్పించేందుకు భక్తులు క్యూ కట్టారు.