వేగంగా మిషన్‌ భగీరథ పనులు

నల్లగొండ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): మిషన్‌భగీరథ పనులలో కొంత జాప్యం జరిగినా, ప్రస్తుతం పనులు పూర్తి అయ్యాయని, డిసెంబర్‌ నాటికి మిగతా పనులు కాగలవని జిల్లా కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ అన్నారు.మిషన్‌భగీరథ ట్రయల్న్‌ చేపట్టేందుకు పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌భగీరథ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.గ్రామాల్లో మిషన్‌ భగీరథలో భాగంగా చేపడుతున్న ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, పైపులైన్‌ పనులను పరిశీలించారు. ఇకపోతే జిల్లా వ్యాప్తంగా మొదటి విడుత 2వేల డబుల్‌ బెడ్రూంలు మంజూరు అయ్యాయన్నారు.