వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి

కరీంనగర్‌, ఆగస్టు 30: వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందిన ఘటన గోదావరిఖనిలోని సింగరేణి ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న 13 ఏళ్ల బాలుడిని తల్లిదండ్రులు సింగరేణి ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్న బాలుడు పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. అయితే బాలుడి మృతికి వైద్యుల నిర్లక్షమే కారణమని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.