వైభవంగా వరలక్ష్మి వ్రతాలు

వేములవాడ, ఆగస్టు-5 (జనం సాక్షి) :

శ్రావణ శుక్రవారం సందర్భంగా వేములవాడలో వరలక్ష్మి వ్రతాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. అలాగే ఇండ్లలో మహిళలు పెద్ద ఎత్తున వరలక్ష్మీ వ్రతాలు, లక్ష్మి పూజలు నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.