వైభవంగా శ్రీవారి కాసుల హారం ఊరేగింపు

తిరుమల,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):తిరుమలలో శ్రీవారి కాసుల హారం ఊరేగింపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఏటా తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర¬్మత్సవాల్లో నిర్వహించే గజవాహన సేవలో వెంకటేశ్వర స్వామి వారి కాసులహారాన్ని అలంకరించడం ఆనవాయితీ. తిరుమాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించిన అనంతరం… హారాన్ని తిరుమల నుంచి తిరుచానూరుకు తరలించారు. కార్తీక బ్ర¬్మత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం పద్మావతి దేవేరికి గజవాహన సేవను నిర్వహిస్తారు. అమ్మవారి గజవాహన సేవలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొంటారు.