వైసీపీని వీడే ప్రసక్తే లేదు 

– నా తండ్రిని చంపిన టీడీపీలోకి నేనెలా వెళ్తా
– అలాంటి చెత్తవార్తలు రాస్తే పరువునష్టం దావా వేస్తా
– వైసీపీ నేత వంగవీటి రాధా
విజయవాడ, జనవరి18(జ‌నంసాక్షి) : తాను పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వంగవీటి రాధా. వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు అని తన విషయంలో జరుగుతున్న ప్రచారం పట్ల ఆయన మండి పడ్డారు. తను వైకాపాను వీడను అని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేయడమే తన విధి అని ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాదు.. తను పార్టీ మారతానని కల్పిత వార్తలు రాయవద్దని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి చెత్తవార్తలు రాస్తే.. పరువు నష్టం దావా వేస్తాను.. అని వంగవీటి రాధా హెచ్చరించారు. వంగవీటి రాధా వైకాపాను వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటారు అని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. వెబ్‌ విూడియా ద్వారా ఈ ప్రచారం గట్టిగా జరిగింది. సోషల్‌ విూడియా ద్వారా దీనికి మరింత ప్రచారం లభించింది. ఈ నేపథ్యంలో రాధా స్వయంగా స్పందించాల్సి వచ్చింది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాకు సోదరసమానుడని, వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి
గెలిచి.. పార్టీని అధికారంలోకి తీసుకొస్తామన్నారు. నా తండ్రిని చంపిన తెలుగుదేశం పార్టీలోకి చేరాల్సిన ఖర్మ నాకు పట్టలేదు.. అని రాధా వ్యాఖ్యానించారు. రాధా నోరు విప్పడంతో గత రెండు రోజులుగాపార్టీ మార్పూపై ప్రచారానికి తెరపడినట్లయింది.