వైసీపీ ఓట్లు తొలగిస్తున్నారు

– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వైసీపీ ఫిర్యాదు
అమరావతి, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : చిత్తూరు జిల్లాలో వైసీపీ ఓట్లు తొలగిస్తున్నారని వైసీపీ నేతలు సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అక్రమ నిర్బంధం, చిత్తూరు జిల్లాలో ఓట్ల తొలగింపు సర్వేలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు వైసీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కంబాల జోగులు, రక్షణనిధి, అంబటి రాంబాబు, కాసు మహేష్‌ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు ఉన్నారు. అనంతరం వైసీపీ నేతలు విూడియాతో మాట్లాడుతూ.. చిత్తూరులో జరిగిన పరిణామాలపై ఫిర్యాదు చేశామని, మా టాబ్‌లతో వచ్చి సర్వేలు చేయడాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి అడ్డుకున్నారని చిత్తూరు జిల్లా ఎస్పీ ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నారని అన్నారు. ఎస్పీ విూద చర్యలు తీసుకోవాలని కోరామని, పోలీసుల సహకారంతో సర్వేలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేను రాత్రంతా బస్సులో తిప్పి ఉదయం సత్యవేడులో వదిలారని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. అధికార యంత్రాంగం మొత్తం ప్రభుత్వ చెప్పుచేతల్లో నడుస్తోందని, అధికారం కోసం ముఖ్యమంత్రి పోలీసుల్ని ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఎన్నికల అధికారులు కూడా నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని, సీనియర్‌ ఎమ్మెల్యే నియోజకవర్గంలో వైసీపీ అనుకూల ఓట్లను తొలగిస్తున్నారన్నారు. టాబ్‌లతో సమాచారం భద్రపరిచేవాళ్లను వదిలి, ఫిర్యాదు చేసినవాళ్లను అరెస్ట్‌ చేశారన్నారు. పోలీసులు అహంకారంతో సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యేను తమిళనాడు తీసుకెళ్లి హింసించారని ఫిర్యాదు చేశారు.  చెవిరెడ్డి ఏంతప్పు చేశారని కేసు పెట్టారని ప్రశ్నించారు. చిత్తూరు ఎస్పీ విూద చర్యలు తీసుకోవాలని, ఓట్ల తొలగింపు ద్వారా గెలవాలని ప్రయత్నిస్తున్నారని, ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన మేరకు చర్యలు తీసుకోవడం లేదని వైసీపీ నేతలు పేర్కొన్నారు.